సింగర్ సునీత తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఇటీవలే రామ్ ను రెండో పెళ్లి చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఆమె ఎప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటారు. తాజాగా ఫ్యాన్స్ కు ఆమె ఓ శుభవార్త చెప్పారు. కరోనా వైరస్ వల్ల తాను షూటింగ్స్, రికార్డులకు వెళ్లడం లేదని ఇంటికే పరిమితమయ్యానన్నారు. దీంతో ఇన్ స్టాగ్రామ్ లైవ్ ద్వారా అందరితో మాట్లాడుతానని తెలిపారు. ఇక నుంచి ప్రతి రోజు రాత్రి 8 గంటల నుంచి 8.30 వరకు అరగంట పాటు ఫ్యాన్స్ తో మాట్లాడుతానన్నారు. అభిమానులు కోరిన పాటలు పాడి వినిపిస్తానన్నారు. కేవలం ఇన్ స్టాగ్రామ్ లైవ్ ద్వారానే అందుబాటులో ఉంటానన్నారు.