ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'చిత్రం' సినిమా సీక్వెల్‌తో నేనా రానా తమ్ముడు ఎంట్రీ.?

cinema |  Suryaa Desk  | Published : Wed, May 12, 2021, 10:33 AM



విలక్షణ దర్శకుడు తేజ ఇప్పుడు అలమేలు మంగ వెంకట రమణ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్ హీరోగా నటిస్తుండగా హీరోయిన్ ఎవరు అనే దాని మీద ఇప్పటికీ సరైన క్లారిటీ లేదు. అయితే నటన మీద ఆసక్తి ఉన్న ఎంతోమందిని హీరోలుగా పరిచయం చేశారు దర్శకుడు తేజ. 40మందికి పైగా కొత్తవారిని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆయన ఇప్పుడు మరో యువకుడికి హీరోగా పరిచయం చేసే బాధ్యత తీసుకున్నారని తెలిసింది. తాజాగా ఆయన 'చిత్రం' సినిమాకు సీక్వెల్‌గా 'చిత్రం 1.1' చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు వివరాలు ఇంకా వెల్లడించలేదు. అయితే తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో హీరోగా సురేశ్‌ ప్రొడక్షన్స్‌ అధినేత సురేశ్‌బాబు రెండో తనయుడు అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారని తెలిసింది. అభిరామ్‌ను హీరోగా చూడాలన్నది డి.రామానాయుడు కోరిక. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే అభిరామ్‌ వెండితెరపై సందడి చేస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com