ప్రముఖ టీవీ నటుడు, సింగర్ అమిత్ టాండన్ నటి మౌని రాయ్ పై సంచలన ఆరోపణలు చేశాడు. మౌని రాయ్ ఒక మోసపూరితమైన మహిళ అని అన్నాడు. ఆమెను తాను ఎప్పటికీ క్షమించనంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మౌని రాయ్, అమిత్ టాండన్, అతని భార్య రూబీలు మంచి ఫ్రెండ్స్. కానీ వీరిమధ్య విభేదాలు తలెత్తాయి. అమిత్ భార్య రూబీ దుబాయ్లో అరెస్టు అయి జైలుకు వెళ్లినప్పటి నుంచి వారి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ టాండన్ మాట్లాడుతూ మౌని రాయ్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన భార్య రూబీ కష్టకాలంలో ఉన్నప్పుడు మౌని రాయ్ మొహం చాటేసిందని అమిత్ చెప్పాడు. అవసరానికి ఉపయోగించుకుని కష్టకాలంలో అలా వదిలేయడం తన భార్య రూబీని తీవ్రంగా బాధించిందని తెలిపాడు. మౌని రాయ్ చాలా జన్యున్ అనుకున్నాం కానీ.. రూబీ దుబాయ్ జైలులో ఉన్నప్పుడు తన నిజస్వరూపం చూశాం అని అమిత్ చెప్పుకొచ్చాడు. అమిత్ డెర్మటాలజిస్ట్ అయిన రూబిని 2007లో వివాహం చేసుకున్నాడు. వారికి కూతురు జియాన పుట్టింది. అయితే పలు విభేదాల కారణంగా ఈ జంట 2017లో విడిపోయి మళ్లీ 2019లో కలుసుకున్నారు. 2017లో దుబాయ్ వెళ్లిన రూబి అక్కడ ప్రభుత్వ అధికారులను బెదిరించిందనే ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. 10 నెలల పాటు దుబాయ్ అల్ రఫా జైలులో ఉంచారు. 2019లో జనవరిలో ఆమె తిరిగి ఇండియాకు వచ్చింది. ఇండియన్ ఐడల్ ద్వారా పాపులర్ అయిన అమిత్ టాండన్ ఆ తర్వాత 'కైసా యే ప్యార్ హై', 'దిల్ మిల్ గయే’ సీరియల్స్ లో నటించాడు. ఇక మౌనీ రాయ్ ఎక్తాకపూర్ నాగిని సీరియల్ తో నటిగా గుర్తింపు పొందింది.