హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన రీసెంట్ సినిమా “నారప్ప” ఓటిటి లో రిలీజ్ అయ్యి భారీ హిట్ అయ్యింది. కానీ అది ఓటిటి రిలీజ్ అవ్వడం పట్ల అభిమానులు సహా జెనరల్ ఆడియెన్స్ లో కూడా కాస్త నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. దీనితో తన మరో మోస్ట్ అవైటెడ్ సినిమా “దృశ్యం 2” మేకర్స్ థియేట్రికల్ రిలీజ్ కే ఓకే చెప్పనున్నారని బజ్ ఆ మధ్య వచ్చింది. అలాగే మరి దీనితో పాటుగా మేకర్స్ ఈరోజు సెప్టెంబర్ 20న ఆసక్తికర ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి దీనిపైనే వారు ఓ బ్యాడ్ న్యూస్ ని వెల్లడించారు. “కొన్ని అనుకోని ఊహించని పరిణామాల రీత్యా ఈరోజు రిలీజ్ చేస్తామన్న దృశ్యం 2 ఫస్ట్ లుక్ పోస్టర్ ని వాయిదా వేస్తున్నామని, ఈ అసౌకర్యానికి చింతున్నామని” అభిమానులకు సారీ చెప్పారు. సరే ఈ అప్డేట్ పక్కకి వెళ్లినా ఈ ఇంట్రెస్టింగ్ చిత్రం నుంచి మరో అప్డేట్ ని మేకర్స్ వదిలారు. అదే ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ అయ్యినట్టుగా కన్ఫర్మ్ చేసారు. ఈ చిత్రానికి సెన్సార్ బృందం క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ ని ఇచ్చారట. ఆల్రెడీ మళయాళంలో జీతూ జోసెఫ్ ఈ సినిమాతో మొదటి పార్ట్ కి మించి సూపర్ హిట్ టాక్ అందుకున్నారు.