బిగ్ బాస్ తెలుగు సీజన్-5 మూడో వారంలోకి అడుగుపెట్టింది. రెండో వారంలో ఉమాదేవి ఎలిమినేట్ అయ్యింది. ఆదివారం ఎపిసోడ్ లో నాగార్జున హౌజ్మేట్స్తో 'ఇంట్లో ఉన్న దెయ్యం ఆట' ఆడించాడు. హౌజ్ మేట్స్ లో ఎవరినైైతే దెయ్యం అని ఫీల్ అవుతున్నారో వారికి స్టిక్కర్ అంటించి సరైన కారణాలు చెప్పాలని నాగార్జున చెప్పారు. కంటెస్టెంట్స్ అందరూ వారి వారి కారణాలు చెప్పి స్టిక్కర్లు అతికించారు. ఈ ఆటలో సిరికి ఎక్కువగా స్టిక్కర్లు వచ్చాయి. రెండో వారంలో నామినేట్ అయిన వాళ్లలో చివరికి నటరాజ్ మాస్టర్, ఉమా దేవీలు అన్ సేఫ్ గా మిగిలారు. చివరకు నటరాజ్ సేఫ్ అయినట్టు నాగార్జున ప్రకటించారు. ఉమా దేవీ ఎలిమినేట్ అయినట్టు అనౌన్స్ చేశారు. ఎలిమినేట్ కానందుకు నటరాజ్ మాస్టర్ వెక్కి వెక్కి ఏడ్చేశాడు. భార్యను ఇలాంటి సమయంలో వదిలేసి వచ్చానని చెప్పాడు. ఉమాదేవికి హౌజ్మేట్స్ సెండాఫ్ ఇవ్వగా, ఆమె స్టేజ్పైకి వచ్చి అందరికి పలు సూచనలు చేసింది. కంటెస్టెంట్ల బొమ్మలున్న కుండలు బద్దలు కొట్టి ఉమా దేవీ తన అభిప్రాయాలను చెప్పేసింది.