అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే రోజురోజుకి గ్లామరస్గా మారుతుంది. ఈ అమ్మడు తన సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోలు చూస్తుంటే ఫ్యాన్స్ థ్రిల్ అయిపోతున్నారు. ఈ అందానికి ఎవరైన మంత్ర ముగ్దులు అవ్వాల్సిందే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, అటు బాలీవుడ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు చేతినిండా అవకాశాలున్నాయి.ఆమె డైరీలో దాదాపు రెండేళ్ల వరకు డేట్స్ లేవని సినీ ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్. రీసెంట్గా నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాలో హీరోయిన్గా నటించాలని అప్రోచ్ అయ్యారట. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా కూడా డేట్స్ ఖాళీ లేవంటూ నో చెప్పేసిందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బీస్ట్ సినిమాలో నటిస్తోన్న పూజా హెగ్డే.. మహేశ్- త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్గా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి.పవన్కళ్యాణ్, హరీశ్ శంకర్ మూవీ భవదీయుడు భగత్సింగ్ సినిమాలోనూ పూజా హెగ్డే పేరే వినిపిస్తోంది. బాలీవుడ్లో సల్మాన్ఖాన్ చిత్రంలోనూ పూజా హెగ్డే నటిస్తుంది. పూజా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రాధేశ్యామ్ చిత్రాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. చిరంజీవిఆచార్యలో కీలక పాత్రలో నటించిన చరణ్కు జోడీగా పూజా హెగ్డే నటించింది. ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతుంది.రీసెంట్గా పూజా.. ఓ అవార్డ్ ఫంక్షన్ కు మోడ్రన్ శారీలో హాజరైంది . పసుపు రంగు చీర, బంగారు రంగు జాకెట్ తో చూడ్డానికి సింపుల్ గా అనిపించే ఈ డ్రెస్ ఖరీదు అక్షరాలా 48వేల రూపాయలు. డిజైనర్ అర్పితా మెహతా ఈ డ్రెస్ ను డిజైన్ చేశారు.ఈ చీరలో పూజా డిఫరెంట్ లుక్స్లో కనిపిస్తూ తెగ సందడి చేస్తుంది. పూజాని ఇలా చూసిన ఫ్యాన్స్ మైమరచిపోతున్నారు.
పూజా హెగ్డే కొన్ని నెలల కిందట లాక్మే ఫ్యాషన్ వీక్ లో పాల్గొంది. అందులో షో స్టాపర్ గా నిలిచిన పూజా హెగ్డే.. ఏకంగా 2 లక్షల రూపాయల ఖరీదైన లెహంగా ధరించి అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. ట్రెడిషనల్ లుక్స్ లో పూజా హెగ్డే తక్కువగా కనిపిస్తుంది. అయితే అలా కనిపించిన ప్రతిసారి అది కాస్ట్ లీ వ్యవహారమే.