బిగ్ బాస్ సీజన్-5 మూడో వారం పూర్తి చేసుకోబోతోంది. ఈరోజు బెస్ట్ పెర్ఫార్మర్, వరస్ట్ పెర్ఫార్మర్ లను కంటెస్టెంట్స్ ఎన్నుకుంటారు. ఇక గురువారం ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ పూర్తయ్యింది. మూడోవారం కెప్టెన్సీ టాస్క్ పోటీదారుల్లో యాంకర్ రవి ఒకరిగా ఎంపికైనట్టు బిగ్ బాస్ తెలిపాడు. ఎందుకంటే అతడు బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేశాడు. ఇక అమెరికా అబ్బాయి, హైదరాబాద్ అమ్మాయి టాస్క్ లో పాల్గొన్న 3 టీంలలో బెస్ట్ పెర్ఫార్మర్ ని వారే ఎన్నుకోవాలని బిగ్ బాస్ చెప్పడంతో అందరూ చర్చించుకుని శ్రీరామ్, జెస్సీ, శ్వేతాలను కెప్టెన్సీ పోటీదారుగా ఎన్నుకున్నారు. లహరి తాను కూడా కెప్టెన్సీ పోటీదారునిగా ఉంటానని ఫైట్ చేసింది. ఆ ఛాన్స్ తనకు దక్కకపోవడంతో నిరాశ చెందింది. ఇక కెప్టెన్సీ టాస్క్లో భాగంగా స్వింగ్ జర స్విమ్ అనే టాస్క్ ఇచ్చారు. ఈ కెప్టెన్సీ టాస్క్ కి లోబో సంచాలకుడిగా వ్యవహరించాడు. కెప్టెన్ పోటీదారులుగా ఉన్న రవి, శ్రీరామ్, జెస్సీ, శ్వేతాలు స్విమ్మింగ్ పూల్ లో ఉన్న కెప్టెన్ అనే అనే అక్షరాలను తీసుకొచ్చి గార్డెన్ ఏరియాలో ఉన్న టేబుల్స్ పై సరిగ్గా పేర్చాలి. అందరి కన్నా ముందుగా ఈ టాస్క్ని జస్వంత్ పూర్తి చేశాడు. దీంతో అతడు హౌజ్ కి కెప్టెన్ అయ్యాడు. తన రేషన్ మేనేజర్ గా షణ్ముఖ్ ను ఎంచుకున్నాడు.