యంగ్ హీరో నాగశౌర్య నటించిన సినిమా “వరుడు కావలెను”. రీతూ వర్మ ఈ సినిమాలో నాగశౌర్య కి జంటగా నటించింది. అక్టోబర్ 29న విడుదలకు సిద్ధంగా ఉన్న 'వరుడు కావలెను' చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్ ను జారీ చేశారు. త్వరలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచనున్నారు. రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ "వరుడు కావలెను" సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో నాగశౌర్య సరసన రీతూ వర్మ హీరోయిన్ పాత్ర పోషిస్తోంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది.