బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్.. నేడు 1177 ఎపిసోడ్కి ఎంటర్ అయ్యింది. వారణాసికి దీప మంచి చెడులు చెప్పి వెళ్లొస్తాను అని చెబుతుంది. అప్పుడే ఆటో వెనుక ఉన్న ‘అమ్మా త్వరగా రా’ అనేది చూసి ‘ఇంకెందుకురా అది తీసెయ్’ అంటుంది. దాంతో వారణాసి ‘ఉండనీ అక్కా. నీ గుర్తుగా ఉంచుకుంటాను’ అంటాడు. ఇక వారణాసి ‘జాగ్రత్త అక్కా’ అని బయలుదేరడంతో దీప ఇంట్లోకి వెళ్తుంది. ఇక కార్తీక్ హాస్పిటల్ తాళాలు అందించడానికి హాస్పిటల్కి వెళ్తూ జీవితంలో జరిగినవన్నీ గుర్తుచేసుకుంటాడు. ‘ఎక్కడ మొదలైంది నా జీవితం ఎక్కడికి వెళ్తోంది దేవుడు సాడిస్ట్ అయ్యి ఉంటాడు. నా మనసులో అనుమానం అనే పెనుభూతాన్ని సృష్టించాడు. మోనిత రూపంలో ప్రళయం ముంచుకొచ్చింది’ అంటూ అన్నీ గుర్తు చేసుకుంటాడు. వెంటనే మనసులో ‘అమెరికా వెళ్లాక.. నేను దీప, హిమ, సౌర్య ఆనందంగా ఉండాలి’ అని ఫిక్స్ అవుతాడు. సీన్ కట్ చేస్తే దీప, శ్రావ్య, ఆదిత్య, ఆనందరావులు షాకింగ్గా నిలబడి ఉంటారు టేబుల్ మీద ఉన్న పేపర్నే చూస్తూ దానిలో మోనిత న్యూస్ పడింది. ఇంతలో సౌందర్య కిందకు వచ్చి వాళ్లు ఎక్స్ప్రెషన్స్ చూస్తూ పేపర్ అందుకుంటుంది. మోనిత గురించి పడిన న్యూస్ చూసి షాక్ అవుతుంది. ఆ న్యూస్లో ‘వింత ప్రేమికురాలు డా. మోనిత విడుదల..’ అనే హెడ్డింగ్తో.. ‘ఇటీవల కాలంలో సంచలనం సృష్టించిన వింత ప్రేమికురాలు.. డా. మోనిత జైలు నుంచి విడుదలైంది. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా గర్భం ధరించి తనని డాక్టర్ కార్తీక్ పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టి ఈ క్రమంలో పలు నేరాలు చేసి ఆ నేరాలకు శిక్ష అనుభవిస్తున్న డాక్టర్ మోనిత.. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, తను గర్భవతి అయినందున కొన్ని షరతులతో కూడిన పెరోల్ను మంజూరు చేసినట్లు తెలుస్తోంది. బయటికి వచ్చిన మోనిత ఏం చేస్తుంది అనేది అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో..’ అంటూ న్యూస్లో రాసి ఉంటుంది. ఆ తర్వాత జరిగేది ఇక ఈ రోజు ఎపిసోడ్ లో చూడాల్సిందే.