టాలీవుడ్ నటి సమంత పిటిషన్ పై కూకట్ పల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. పరువు నష్టం దావా వేసే బదులు వారి నుంచి క్షమాపణలు అడగొచ్చు కదా అని కోర్టు ప్రశ్నించింది. సెలబ్రెటీల వ్యక్తిగత వివరాలు పబ్లిక్ డొమైన్ లో పెట్టేది వారే.. పరువుకు నష్టం భంగం కలిగింది అనేది వారే కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే సమంత విడాకులు ఇంకా తీసుకోకుండానే ఆమెపై దుష్ప్రచారం చేశారని సమంత తరపు న్యాయవాది బాలాజీ వాదించారు. సమంతను టార్గెట్ చేసి వార్తలు రాశారని, తప్పుడు వార్తలు రాసిన వారికి పర్మినెంట్ ఇంజక్షన్ ఇవ్వాలని సమంత న్యాయవాది కోర్టును కోరారు. వాదనలు విన్న కూకట్ పల్లి కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది.