టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముకుంద సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన పూజా హెగ్డే ఇప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోయిన్. ప్రస్తుతం ఆమె రాధేశ్యామ్ వంటి పాన్ ఇండియన్ సినిమాలో నటిస్తోంది. అయితే తాజాగా ఓ ప్రముఖ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా హెగ్డే పెళ్లిపై షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. “ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. అలా చేసిన వారికే తెలుస్తుంది. ఈ మధ్యనే ముంబైలో ఇల్లు కట్టాను. ఇల్లు కట్టడం ఇలా ఉంటే పెళ్లి అంటే ఎలా ఉంటుందో.. కానీ ఒక్కటే. జీవితాంతం వారితో కలిసి ఉండడం మంచిదనిపిస్తే పెళ్లి చేసుకుంటానని నమ్ముతున్నాను.. ఇంట్లో ఒత్తిడి వల్లనో, అందరూ పెళ్లి చేసుకుంటున్నారనే కారణంతో పూజ పెళ్లి చేసుకోకూడదు’’ అని పూజా చెప్పింది.