ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న 'సలార్' సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని ప్రభాస్ లుక్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త వైరల్ గా మారింది. ఇటీవల ఈ సినిమా కోసం రూ.20 కోట్లు ఖర్చు పెట్టి ఓ భారీ ఫైట్ సీన్ ని షూట్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఇదే ఈ సినిమాకు హైలెట్ గా నిలవనుందని సమాచారం. ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రభాస్ డబుల్ రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా శ్రద్ధాకపూర్ తో ఒక స్పెషల్ సాంగ్ కూడా ప్లాన్ చేశారట.