రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే కథానాయికగా తెరకెక్కిన చిత్రం "రాధే శ్యామ్". ఈ సంక్రాంతికి విడుదల అవుతుంది అనుకున్న ఈ సినిమా మళ్లీ వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. అయితే ఈ కొత్త రిలీజ్ ఎప్పుడనే ప్రశ్న ఎప్పటి నుంచో నడుస్తుండగా ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్ పై బజ్ వినిపిస్తోంది. దీని ప్రకారం, మేకర్స్ రెండు తేదీలు కోరుకుంటున్నారు. మొదట ఇది మార్చి 17 మరియు ఇప్పుడు అది మార్చి 18. మరి ఈ మోస్ట్ ఎవైటెడ్ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో చూడాలి.