సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. అది సినిమా, రాజకీయం అనే తేడా ఆమెకు లేదు. పడిపోవడమే ఆమెకు తెలుసు. మరోసారి కంగనా బాలీవుడ్ ను టార్గెట్ చేసింది. ఈసారి సౌత్-నార్త్ తేడాతో కొట్టింది. 'సౌత్ లోకి బాలీవుడ్ ను అనుమతించొద్దు. వాళ్లు ఇండస్ట్రీని పాడు చేస్తారు' అని తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది. అదే సమయంలో సౌత్ గొప్పతనం గురించి గొప్పగా రాసుకొచ్చింది. “సౌత్ కంటెంట్ కి, సౌత్ స్టార్స్ కి ఎందుకు అంత ఆదరణ లభిస్తుందంటే.. ? దక్షిణాది స్టార్స్ మన దేశ సంస్కృతి సంప్రదాయ మూలాలకు కట్టుబడి ఉంటారు. వారు తమ కుటుంబాలకు, బాంధవ్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సినిమాపై వారికున్న ప్యాషన్, వృతిపరమైన నిబద్ధత అపారమైనది." అని పేర్కొంది. అంతేకాదు.. బాలీవుడ్ మిమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నించవచు. వారి వలలో చిక్కుకోకండి.. సౌత్ కు సలహా కూడా ఇచ్చింది.