బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ 'రుద్ర'. ఇదో సైకలాజికల్ క్రైమ్ డ్రామా.బ్రిటీష్ టీవీ షో 'లూథర్' ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కు రాజేష్ మపుస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. రాశీఖన్నా. ఈషా డియోల్, అతుల్ కులకర్ణి, అశ్విని కల్సేకర్, ఆశిష్ విద్యార్థి లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. సమీర్ నాయర్ నిర్మాత. అతి త్వరలోనే డిస్నీం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. ఈరోజే 'రుద్ర' ట్రైలర్ విడుదల కానుంది.