కొత్త దర్శకుడు జి. సూర్యతేజ దర్శకత్వంలో విజయ్ శంకర్ - అషూ రెడ్డి జంటగా నటిస్తున్న చిత్రం 'ఫోకస్'. ఇదో సస్పెన్స్ థ్రిల్లర్. సుహాసిని,భానుచందర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో సుహాసిని ఫస్ట్ లుక్ ను స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ విడుదల చేశారు. చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. మార్చిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు సూర్యతేజ తెలిపారు.