ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యాష్ అండ్ శ్రీనిధి శెట్టి నటించిన 'KGF 2' సినిమా బాక్స్ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ప్రస్తుతం దేశంలోని మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ప్రశాంత్ నీల్ ఒకడు. తాజాగా ఈ స్టార్ డైరెక్టర్ తన తదుపరి ప్రాజెక్ట్ ని టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సెన్సషనల్ డైరెక్టర్ కొన్ని రోజుల క్రితం నేచురల్ స్టార్ నానిని కలిశాడని మరియు అతనితో ఒక ప్రాజెక్ట్ గురించి చర్చించాడని వార్తలు వినిపిస్తున్నాయి. 'ఎన్టీఆర్ 31' లో ఒక కీలక పాత్ర గురించి చర్చించడానికి ప్రశాంత్ నీల్ నానిని కలిశాడని లేటెస్ట్ టాక్. ప్రస్తుతం నాని తన కొత్త సినిమా 'దసరా' షూటింగ్లో బిజీగా ఉన్నాడు.