గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న అగ్రదర్శకుడు మణిరత్నం మరోసారి నవాబు రూపంలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అరవింద్ స్వామి, శింబు, విజయ్ సేతుపతి, ప్రకాశ్ రాజ్, జ్యోతిక, అరుణ్ విజయ్, అదితిరావు హైదరీ లాంటి భారీ తారాగణంతో నవాబు చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం తమిళంలో చెక్క చివంతా వానం అనే పేరుతో విడుదల అవుతున్నది. నవాబు చిత్రాన్ని సెప్టెంబర్ 28న రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా డేట్ను తాజాగా చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఎమోషనల్, యాక్షన్ అంశాలను మేలవించి ఈ చిత్రాన్ని మణిరత్నం రూపొందించారు. నవాబు చిత్రానికి సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందించారు. ఆడియో లాంచ్ సందర్భంగా రెహ్మాన్ మాట్లాడుతూ.. గతంలో దళపతి చిత్రం నాటి ఎనర్జీ మణిరత్నంలో కనిపించింది అన్నారు. మళ్లీ నవాబుతో భారీ హిట్ కొట్టడం ఖాయమని రెహ్మన్ పేర్కొన్నారు.ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన తమిళ వెర్షన్లోని రెండు పాటలను యూట్యూబ్లో విడుదల చేశారు. ఈ రెండు పాటలకు మంచి స్పందన వస్తున్నది. త్వరలోనే నవాబు ఆడియో వేడుకను హైదరాబాద్లో నిర్వహించనున్నారు.