ఓటమెరుగని విక్రమార్కుడు రాజమౌళి.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి టాప్ స్టార్స్ ప్రధాన పాత్రలలో క్రేజీ మల్టీ స్టారర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం భారీ బడ్జెట్తో తెరకెక్కుతుండగా నవంబర్ 18న ఈ సినిమా తొలి షెడ్యూల్ మొదలు కాగా,రీసెంట్గా కంప్లీట్ అయ్యింది. జనవరిలో రెండో షెడ్యూల్ మొదలు పెట్టనున్నారు. ఈ చిత్రం ఆర్ఆర్ఆర్ ( రామ రావణ రాజ్యం) అనే టైటిల్తో ప్రచారం జరుపుకుంటుండగా, చిత్ర కథ రామాయణం ఇతి వృత్తంగా ఉంటుందని అంటున్నారు.
అంతే కాదు ఇందులో రామ్చరణ్ రాముడిగానూ, జూనియర్ ఎన్టీఆర్ రావణుడిగానూ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఒకప్పటి అందాల నటి ప్రియమణి ఇందులో నెగెటివ్ రోల్లో కనిపించనుందని సమాచారం. అయితే ఈ మూవీలో కథానాయికలుగా కీర్తి సురేష్, రష్మికని ఎంపిక చేశారని ప్రచారం జరుగుతుండగా, కీర్తి సీత పాత్రలో కనిపించనుందని టాక్. రామాయణం ఇతివృత్తంగా రూపొందుతున్న క్రమంలో ఇలాంటి ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. డిసెంబర్ 12న చిత్రానికి సంబంధించి భారీ ఎనౌన్స్మెంట్ వస్తుందని తెలుస్తుండగా, ఆ రోజు ఏం ప్రకటిస్తారో చూడాలి.