మెగాపవర్ స్టార్ రామ్చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను క్రేజీ కాంబినేషన్లో భారీ కమర్షియల్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అగ్ర నిర్మాత డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వాని హీరోయిన్ . ఈ చిత్రంలో ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్, స్నేహ, వివేక్ ఒబెరాయ్ తదితరులు ప్రధాన తారాణంగా నటిస్తున్నారు. 2019 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బోయపాటి ఈ మూవీలోమాస్ మసాల సాంగ్ ను షూట్ చేయనున్నాడు.. ముందుగా ఈ సాంగ్ ను కేథరిన్ థెరిస్సాతో చేయాలని అనుకున్నప్పటికీ తాజాగా ఆమె స్థానంలో బాలీవుడ్ హాట్ భామ ఈషా గుప్తాను తీసుకున్నట్లు టాక్… అన్నపూర్ణ స్టూడియో వేసిన పబ్ సెట్ లో ఈ నెల 14వ తేది నుంచి ఈ సాంగ్ ను చిత్రీకరించనున్నారు.