విశ్వనటుడు కమల్హాసన్ కుమార్తెగా సినీరంగానికి పరిచయమైంది శ్రుతిహాసన్. కానీ తండ్రి వారసత్వాన్ని పరిచయం వరకే ఉపయోగించుకుంది. నటిగా సొంతంగా ఎదిగే ప్రయత్నం చేసింది. కమల్ కుమార్తెగా కాకుండా శ్రుతిగానే పేరు తెచ్చుకుంది. తెలుగుతో పాటుగా అన్ని భాషల్లో నటించిన శ్రుతి సంఖ్యాపరంగా తక్కువ సినిమాలే చేస్తోంది. ఇతర కమర్షియల్ నాయికల్లో ఎక్కువ సినిమాలు చేయడం లేదు. తాజాగా నిర్మాతగా మారి అందరినీ ఆశ్చర్యపరిచింది. జయప్రకాష్ రాధాకృష్ణన్ దర్శకత్వంలో ది మస్కిటో ఫిలాసఫి పేరుతో చిత్రాన్ని నిర్మిస్తోంది. నటిగా నాకు ఎదురైన అనుభవాలు చాలా ఉన్నాయి. వాటిలో అనేక మంది నిర్మాతలు నాకు పారితోషికం ఇవ్వలేదు. కొందరు పూర్తిగా ఎగ్గొట్టారు. ఇప్పుడు నేను నిర్మాతగా మారాను. వారిలా వ్యవహరించను అని స్పష్టం చేసింది. కొన్ని సినిమాలు నేను చేయాలని అనుకున్నాను. అలాంటివి చేయలేకపోయాను. ఇప్పుడు నా సొంత సంస్థలో అలాంటి సినిమాలు చేస్తాను. బిజినెస్ పరంగా కూడా వర్కవుట్ అవుతుంది అని నమ్ముతున్నాను అని చెప్పింది. నిర్మాతగా అనుభవం లేదనేది నిజమే. ఈ వ్యవహారాలు మా అమ్మ (సారిక) చూసుకుటుంటున్నారు. ఆవిడకు అనుభవం ఉంది. నేను మంచి నిర్మాతను అనిపించుకుంటాను అని శ్రుతి తెలిపింది.