మంచి సినిమాగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అని చెప్పింది రాయ్లక్ష్మి. ఆమె కథానాయికగా నటించిన చిత్రం వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ. కిషోర్కుమార్ దర్శకుడు. ఎం.శ్రీధర్రెడ్డి, ఆనంద్రెడ్డి, ఆర్.కె.రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్కార్తిక్, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రధారులు. హరిగౌరా సంగీతాన్ని అందించిన ఈ చిత్ర గీతాలు మంగళవారం హైదరాబాద్లో విడుదలయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ చిత్ర నిర్మాణం వద్దని తొలుత చాలా మంది వారించారు. ఈ సినిమా ప్రయాణంలో ఇండస్ట్రీలో మాకు ఎలాంటి చెడు అనుభవాలు ఎదురుకాలేదు. కథను నమ్మి ఈ సినిమా చేశాం. వెంకటలక్ష్మీ పాత్రకు రాయ్ లక్ష్మి సంపూర్ణంగా న్యాయం చేసింది. తొలుత ఆమె ఈ పాత్ర చేయడానికి అంగీకరిస్తారో లేదో అని సంశయించాం. కానీ కథ విని వెంటనే ఒప్పుకున్నారు. ప్రతి ఒక్కరూ మనసుపెట్టి పనిచేసిన సినిమా ఇది అని తెలిపారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే చిత్రమిదని, వెంకటలక్ష్మి ఎవరో? తెలుసుకునే ప్రయత్నం చేసిన కొందరికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయన్నది నవ్వులను పంచుతుందని దర్శకుడు కిషోర్కుమార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మధునందన్, రామ్కార్తిక్, పంకజ్కేసరి, హరిగౌర తదితరులు పాల్గొన్నారు.