టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాని యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకతంలో చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్-అడ్వెంచర్ చిత్రానికి చిత్ర నిర్మాతలు 'దే కాల్ హిమ్ OG' అనే టైటిల్ ని ఖరారు చేసారు. తాజాగా విడుదలైన టీజర్తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. రెండు నెలల పాటు సాగిన ముంబై షూటింగ్ షెడ్యూల్ విజయవంతంగా ముగిసిందని, ఫలితాలతో మూవీ టీమ్ ఆనందంగా ఉందని సమాచారం. పవన్ కళ్యాణ్ రాజకీయాలలో మరియు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా యొక్క బిజీ షెడ్యూల్ ఉన్నందున పవన్ కళ్యాణ్ తప్పక హాజరు కావాల్సిన తదుపరి షెడ్యూల్ ప్రారంభం కావడానికి కొంత సమయం పట్టవచ్చు అని ఫిలిం సర్కిల్ లో లేటెస్ట్ టాక్.
ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్లో ప్రియాంక అరుల్ మోహన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్, అమితాబ్ బచ్చన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 2023లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ బిగ్గీకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.