నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మథుడు 2' రూపొందుతోంది. నెల రోజులుగా ఈ సినిమా షూటింగు 'పోర్చుగల్' లో జరుగుతోంది. తాజాగా ఈ మేజర్ షెడ్యూల్ షూటింగును పూర్తి చేశారు. ఈ నెల రోజుల్లో ప్రధాన పాత్రధారుల కాంబినేషన్లో అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.
రకుల్ ప్రీత్ ప్రధాన కథానాయికగా నటిస్తుండగా, మరో కథానాయిక పాత్రలో అక్షర గౌడ కనిపించనుంది. ఇక సీనియర్ హీరోయిన్ లక్ష్మి ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. సమంత .. వెన్నెల కిషోర్ ప్రత్యేక పాత్రల్లో అలరించనున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో నాగార్జున వున్నారు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి మరి.