బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం చిత్రం ‘సీత’. మన్నారా చోప్రా మరోనాయిక. ఎ.కె.ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రామబ్రహ్మం నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఆర్ఎక్స్100 భామ పాయల్ రాజ్పుత్ ప్రత్యేక గీతంలో నటించారు. మే 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను సోమవారం సాయంత్రం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ ‘‘సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరి ప్రేమ, ఆదరణ పొందడానికి నేను జీవితాంతం ఇలాగే కష్టపడుతూ ఉంటా. సినిమానే నాకు ప్రాణం. సినిమాకోసం నేను ఏమైనా చేస్తా. తేజగారిలాంటి ఫ్యాషనేట్ ఫిల్మ్ మేకర్ను నేను లైఫ్లో ఇప్పటివరకు కలవలేదు. ఇలాంటి ప్యాషన్ ఉన్న డైరెక్టర్లను అరుదుగా చూస్తాం. నా ఆరో సినిమాకే ఇలాంటి దర్శకుడితో పనిచేస్తానని అనుకోలేదు. ‘సీత’ సినిమాలో నేను చేసిన రఘురామ్ అనే పాత్ర ఛాలెంజింగ్ రోల్. సినిమా చూశాక నా క్యారెక్టర్కు తప్పకుండా సర్ప్రైజ్ అవుతారు. ఈ సినిమా నాకు ఒక యాక్టర్గా మంచి రెస్పెక్ట్ తీసుకొస్తుందని బలంగా నమ్ముతున్నాను. హీరో అంటే ఫస్ట్ కనిపించాలి. ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయ్యి ఫైట్లు చేసేయాలి అనుకునేవాణ్ని. కానీ తేజగారితో పనిచేశాక అది తప్పని తెలుసుకున్నాను. ఈ సినిమా కథ విషయానికి వస్తే మహిళలకు పురుషుల కంటే మేధస్సు ఎక్కువ అని చెబుతుంటాం. కానీ ప్రాక్టికల్గా చూపించలేదు. అందుకే అలాంటి కథతో సీత అనే సినిమా చేశాం. టైటిల్ రోల్ చేసిన కాజల్ చాలా కష్టపడ్డారు. సోనూసూద్ గారు ఈ సినిమాకు ప్రాణం పెట్టి పనిచేశారు. మన్నారాచోప్రాతో పాటు ఇతర నటీనటులు కూడా చక్కగా నటించారు. మా ప్రొడ్యూసర్ అనిల్గా మా అందరినీ మేనేజ్ చేసి చాలా బాగా చూసుకున్నారు. మా నాన్నగారి బ్యానర్ తర్వాత ఇంత పెద్ద బ్యానర్లో పనిచేయడం ఇదే తొలిసారి. అనూప్ రుబెన్స్ గారు ఆర్ఆర్తో చాలా బాగా ఆకట్టుకున్నారు. సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులకు ఆ విషయం తెలుస్తుంది.’’ అన్నారు.