వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం జరిగిన భారత్, పాక్ మ్యాచ్ లో దాయాది జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ సమయంలో పాక్ కు చెందిన పలువురు నెటిజన్లు భారత టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జాను ఉద్దేశిస్తూ సోషల్ మీడియలో సెటైరికల్ కామెంట్లు చేస్తున్నారు.పలువురు సెలబ్రిటీలు కూడా సానిమాపై సెటైరికల్ కామెంట్స్ చేశారు. తనపై కామెంట్ చేపసిన పాక్ నటి వీణా మాలిక్ కు తనదైన స్టైల్ లో సమాధానమిచ్చింది సానియా మీర్జా.
గతంలో సానియా తన భర్త షోయబ్ మాలిక్, కుమారుడు ఇజాన్, ఇతర పాకిస్థానీ క్రికెటర్లతో కలిసి ఓ హుక్కా బార్కు వెళ్లారు. ఆ సమయంలో సానియా హుక్కా తాగుతున్నప్పుడు తీసిన వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొద్దిసేపటి తర్వాత ఆ వీడియోను తొలగించేశారు.సోమవారం(జూన్-17,2019) దీని గురించి వీణా మాలిక్, సానియాను ట్యాగ్ చేస్తూ.. సానియా, మీ అబ్బాయి విషయంలో నేను చాలా చింతిస్తున్నాను. మీరంతా కలిసి ఆ చిన్నారిని హుక్కా బార్కు తీసుకెళతారా? అది ఎంత ప్రమాదకరమో తెలుసా? నాకు తెలిసినంత వరకు మీరు వెళ్లిన బార్లో ఎక్కువగా జంక్ ఫుడ్ అమ్ముతూ ఉంటారు.క్రీడాకారులకు/బాయ్స్ కి ఇది మంచిది కాదు. ఓ తల్లివి,క్రీడాకారిణి అయిన నీకు ఈ విషయాలన్నీ తెలిసుండాలని ట్వీట్ చేసింది.
వీణా ట్వీట్ పై స్పందించిన సానియా....వీణా, నేను నా కుమారుడిని బార్ కు తీసుకెళ్లలేదు. అయినా ఈ విషయాలన్నీ మీకు అనవసరం. నేను నా బిడ్డను ఎంత జాగ్రత్తగా చూసుకుంటానో నాకు మాత్రమే తెలుసు. మరో విషయం గుర్తుంచుకోండి.నేను పాకిస్తాన్ క్రికెట్ టీం డైటీషియన్ను కాను. వారి తల్లిని కాను. ప్రిన్సిపల్ని కాను. టీచర్ను కాను.వాళ్లు ఎప్పుడు నిద్రలేస్తారు,నిద్రపోతారు,తింటారు అని తెలుసుకోవడానికి. ఏదేమైనా మీరు మా పట్ల ఇంత శ్రద్ధ చూపుతున్నందుకు ధన్యవాదాలు. కొందరు ఇలాంటి ట్వీట్లు చేస్తూ నాకు పిచ్చెక్కిస్తుంటారు. మీ ఫ్రస్ట్రేషన్ను పోగొట్టుకోవడానికి ఇతర మార్గాలను ఎంచుకోండంటూ సానియా చురకలంటించింది.