తెలుగులో స్టార్ హీరోయిన్ గా సుదీర్ఘ కాలంగా తన జోరును కొనసాగిస్తోన్న నటి కాజల్ అగర్వాల్. ఈ భామ కూడా నిర్మాతగా మారడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నట్టుగా సమాచారం. తెలుగులో ఆమె నిర్మించనున్న తొలి చిత్రానికి తేజ దర్శకుడిగా వ్యవహరించనున్నాడట. తెలుగు తెరకి కాజల్ ను తేజ పరిచయం చేశాడు. ఆ కృతజ్ఞతతో ఆయన దర్శకత్వంలోనే తొలి సినిమాను నిర్మించాలని ఆమె ప్లాన్ చేసుకుంటోందని సమాచారం. కాజల్ ప్రధాన పాత్రధారిగానే ఈ కథ సాగుతుందట.