సైరా చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ కొరటాల శివతో ఓ చిత్రాన్ని చేయనున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై రామ్చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ చిత్రంలో చిరంజీవికి జంటగా నయనతారను తీసుకోవాలని అనుకున్నారట. కానీ ఇప్పుడు అందాల తార ఐశ్వర్యారాయ్ పేరు వినిపిస్తోంది. చిరు పక్కన ఎప్పుడూ చూడని నటిని ఎంపికచేసుకుంటే సినిమాకు ఫ్రెష్లుక్ వస్తుందని, ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నయనతారే హీరోయిన్ కావడంతో ఆమెను వద్దనుకున్నారని ఫిలిం వర్గాల సమాచారం. త్వరలో హీరోయిన్కు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో ఓ సెట్ని తీర్చుదిద్దుతున్నారు. అక్కడే తొలి షెడ్యూల్ త్వరలో మొదలు కానుంది. ఇందులో చిరు ద్విపాత్రాభినయం చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారు. 2020 వేసవికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. చిరూకి ఇది 152వ చిత్రం.