యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా 'గుండె జారి గల్లంతయ్యిందే' ఫేమ్ కొండా విజయ్కుమార్ దర్శకత్వంలో 'ఏమైంది ఈవేళ', 'అధినేత', 'బెంగాల్ టైగర్', 'పంతం' వంటి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత కె కె రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న కొత్త చిత్రం `ఒరేయ్.. బుజ్జిగా`. సెప్టెంబర్ 10 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సందర్భంగా నిర్మాత కె కె రాధామోహన్ మాట్లాడుతూ ``రాజ్ తరుణ్, కొండా విజయ్కుమార్ కాంబినేషన్ లో మా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ 'ప్రొడక్షన్ నెం 8' ప్రారంభించాం. ఈ చిత్రానికి 'ఒరేయ్.. బుజ్జిగా' అనే టైటిల్ కన్ఫర్మ్ చేశాం. ఈ రోజు నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరగనుంది అని ఆయన తెలిపాడు.