వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన సినిమా కొండ పొలం. ఈ సినిమాలో రకుల్ ప్రీతీ సింగ్ హీరోయినిగా నటించింది. ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన కొండపొలం నవల ఆధారంగా ఈ సినిమా తీశారు. ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహించాడు. దసరా కానుకగా అక్టోబర్ 8న విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీలో వచ్చేసింది.ఈ సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా నిర్మించారు.