గత దశాబ్దానికిపైగా కెరీర్లో కాజల్ అగర్వాల్ 50కిపైగా చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఇండియన్ 2 మూవీలో నటించడానికి సిద్ధమవుతున్నారు. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్తో కలిసి నటించిన కవచం సినిమా రిలీజ్కు రెడీ అయింది. కవచం సినిమా ప్రమోషన్లో భాగంగా తెలుగు ఫిల్మీబీట్తో ముచ్చటించింది. ఈ సందర్భంగా తాను చేస్తున్న సేవా కార్యక్రమాలను వెల్లడించింది. మూడో కంటికి తెలియకుండా కాజల్ చేస్తున్న సేవ షాక్ గురిచేస్తున్నది. ఆమె గిరిజనుల కోసం చేస్తున్న సేవ ఏంటంటే.ప్రస్తుతం నేను అరకు వ్యాలీలో గిరిజన పిల్లల కోసం సేవలందిస్తున్నాను. థింక్ పీస్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తున్నాను. చాలా కష్టమైన పని అది. దాని కోసం నేను కొంత సమయాన్ని కేటాయిస్తున్నాను. అక్కడ ఓ పాఠశాలను కట్టించాను. అక్కడి పిల్లలకు చదువుతోపాటు ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు. కేవలం చదువే కాదు. అక్కడి వారికి శానిటేషన్, మధ్యాహ్న భోజనం అందిస్తున్నది.
మారుమూల ప్రాంతాల్లో గిరిజన పిల్లలకు చదువుకోవడానికి సౌకర్యం లేదు. అందుకే వారి కోసం ప్రాథమిక విద్యను అందించాలని కోరుకొన్నాను. సమాజంలో మంచి వాళ్లు ఎంత మందో ఉన్నారు. మరుగున పడిన, సమాజానికి దూరంగా ఉండే వాళ్ల కోసం పనిచేసే వారికి సహకారం అందించాలి. అలాంటి ప్రజల కోసం నేను చొరవ తీసుకొన్నాను.అరుకు వ్యాలీలో నేను గిరిజన స్కూల్ను స్థాపించడానికి, అక్కడి వాళ్లకు సహకారం అందించడానికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. నేను ఎక్కువ సార్లు షూటింగ్లకు కోసం అక్కడికి వెళ్లడం వలన నాకు ఆ ప్రాంతంతో అనుబంధం ఏర్పడింది. అక్కడి వారి పరిస్థితులు చూసి నేను ఏదో ఒకటి చేయాలని అనుకొన్నాను. అందుకే అక్కడ స్కూల్ కట్టించాను.